AMARAVATHIDISTRICTS

రైతు ఆత్మహత్య ప్రయత్నంపై స్పందించిన కలెక్టర్

నెల్లూరు: జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిన రైతు వెంకటరామయ్య సంఘటనపై జిల్లా కలెక్టర్ హరినారాయణన్ స్పందించారు. జలదంకి మండలం మద్దూరుపాడు గ్రామానికి చెందిన రైతు వెంకటరామయ్య తన భూమిలోకి తనను కొంతమంది రానివ్వడం లేదని, మండల స్థాయి అధికారులకు చెప్పినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని, ఆవేదనతో నెల్లూరు కలెక్టరేట్లో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే రైతు వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని డిఆర్ఓ లవన్న ను ఆదేశించారు. రైతు వద్దకు వెళ్లిన డిఆర్వో అతని సమస్యలు తెలుసుకుని, రైతు సమస్యపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జలదంకి తాసిల్దార్ ను ఆదేశించారు. కావలి ఆర్డిఓ, డిఎస్పీలతో మాట్లాడారు. రైతును భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిఆర్వో లవన్న ఆర్డీవోకు తెలిపారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *