AMARAVATHI

చంద్రబాబుకు ఈ నెల 22వ తేది వరకు రిమాండ్

అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టులో ఆయనకు చుక్కెదురైంది..న్యాయస్థానం ఆయనకు ఈ నెల 22వ తేది వరకు జ్యుడీషియల్ రిమాండ్(14 రోజులు) విధిస్తూ తీర్పు వెలువరించింది..దీంతో చంద్రబాబు సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్నారు..ఆయన తరఫు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. సోమవారం రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది.. చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించేదుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.. చంద్రబాబు తరపును సుప్రీమ్ కోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా గట్టిగ తన వాదనలు విన్పించినప్పటికి,ఏసిబి కోర్టు జడ్జీ కేసు తాలుక పూర్వపరాలు పరిశీలించిన మీదటి రిమాండ్ కు అదేశించారు.
జుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు..అయను జైలుకు తరలించకుండా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని లేదా కేంద్ర కారాగారానికి తరలించినట్టు అయితే అక్కడ ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించాలని,,చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఇంటి భోజనం, మందులు తీసుకునేందుకు అనుమతించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు..మరో వైపు చంద్రబాబును విచారించేందుకు వారం పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీఐడీ కూడా పిటిషన్ దాఖలు చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *