AMARAVATHIDEVOTIONAL

అక్షరధామ్ ఆలయాన్ని సందర్శంచిన రిషి సునక్ దంపతులు

అమరావతి: G-20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు వచ్చిన UK ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని అదివారం సందర్శించారు..ఈ సందర్భంలో రిషి సునక్ తన భారతీయ మూలాలు,, దేశంతో ఉన్న అనుబంధం గురించి వ్యాఖ్యలు చేసారు..భారీ వర్షం కురుస్తున్నప్పటికి ఉదయం 6.30 గంటలకు ఆలయానికి చేరుకున్న దంపతులకు, ఆలయ పూజారులు ప్రాంగణం మొత్తం దగ్గరుండి చూపించారు.. ఆలయ దర్శనం అనంతరం ఆయన వ్యాఖ్యనిస్తూ ‘నా భారతీయ మూలాలు, భారతదేశంతో నా సంబంధాల విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను..గర్వించదగిన హిందువుగా ఉండటం అంటే,, నాకు భారతదేశంతో పాటు భారతదేశ ప్రజలతో ఎప్పుడూ అనుబంధం ఉంటుంది’ అని రిషి సునక్ వ్యాఖ్యానించారు..ఆయన భార్య అక్షతా మూర్తి ఇండియాలోని బిలియనీర్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, విద్యావేత్త సుధామూర్తి దంపతుల కుమార్తె.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *