రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమావేశం
నెల్లూరు: ఎలక్షన్ కమిషన్ House to House సర్వే చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ షెడ్యూల్ వరకు రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించవలసినదిగా ఆదేశించింది..ఎలక్షన్ కమిషన్ అదేశాలతో నగర పాలక సంస్థ పరిధిలో 2024వ సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల లిస్ట్ ల రేషనలైజేషన్ వంటి అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ వికాస్ సమావేశాన్ని నిర్వహించారు..కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు దేవీ కుమారి, నిర్మలానంద బాబా, శ్రీనివాసులు, ధనుంజయ రెడ్డి, దశయ్య పాల్గొన్నారు.