AMARAVATHINATIONAL

ఉజ్జ్వల గ్యాస్ సిలిండర్ పై మరో రూ.100 సబ్సిడీ-కేంద్రం

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..ఉజ్జ్వల గ్యాస్ సిలిండర్ పై మరో రూ.100 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది..గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రాయితీ రూ.300కు చేరుకుంది..తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు అంగీకరించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో తెలిపారు..

తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు..పసుపు రైతుల సంక్షేమసం కోసం తాము కృషి చేస్తామని,, అలాగే, ములుగు జిల్లాలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు..ఆదీవాసీ దేవతలైన  సమ్మక్క సారక్క పేరు పెడుతున్నామని,,ఈ వర్సిటీకి రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు..

కృష్ణ జల వివాదంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 2004లో కేంద్ర సర్కారుకి ఫిర్యాదులు చేశాయని,,ఈ మూడు రాష్ట్రాల ఫిర్యాదుల మేరకు రెండో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటైందన్నారు..2013లో ట్రైబ్యునల్ నివేదిక ఇచ్చిందని,,అప్పట్లో ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందన్నారు..2014లో ఏపి,,తెలంగాణ విడిపోయాక మళ్లీ నీటి కేటాయింపులు జరగలేదన్నారు..ఈ విషయమై నీటి వాటాలు త్వరగా తెల్చలని ట్రైబ్యూనల్ కోరినట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *