రాష్ట్రంలో పలువురు IAS అధికారులు బదిలీ
అమరావతి: రాష్ట్రంలో పలువురు IAS అధికారులు బదిలీ చేస్తూ C.S KS.జవహర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్గా సుమిత్ కుమార్ను నియమించారు..వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా పి. ప్రశాంతి బదిలీ అయ్యారు..అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా ఎం.విజయ సునీతను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..జి వీర పాండ్యన్ను పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.. అలాగే IAS అధికారి రాహూల్ పాండేను GADలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.