AMARAVATHIDISTRICTS

సెయింట్ పీటర్,సెయింట్ జోసెఫ్ స్కూల్స్ మూసి వేయవద్దు,మా పిల్లల విద్యా కాల రాయవద్దు

నెల్లూరు: 900 మంది పేద విద్యార్థులకు ప్రత్నమాయ అడ్మిషన్ చూపకుండా స్కూళ్లు ఎలా మూస్తారు అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అధికారపార్టీ నాయకులను ప్రశ్నించారు.సోమవారం కలెక్టర్ కార్యలయంలో అధికారులకు వినతి పత్రం అందించిన అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ రెండుసార్లు గెలిచిన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పేద విద్యార్థుల చదువును గాలికి వదిలేశారని విమర్శించారు..సూల్స్ మూసి వేయడంపై తల్లిదండ్రులు ఎవరైనా కలెక్టరేట్ వద్దకు వెళ్తే, మీ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని స్థానిక నాయకులతో బెదిరించడం సిగ్గుచేటన్నారు..సెయింట్ పీటర్స్ హై స్కూల్ లో 220 మంది,,సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ ఎలిమెంటరీ స్కూల్ లో 160 మంది,,సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్ లో 226 మంది,సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హై స్కూల్ లో 366 మంది సెయింట్ జోసెఫ్ మొత్తం దాదాపు 900 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో విద్యార్దుల  తల్లి తండ్రులతో పాటు సుధీర్,,ఉమాదేవి,అశోక్,ఖలీల్,ప్రసన్న,మౌనిష్,వర,బన్నీ తదితరులు పాల్గొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *