గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
అమరావతి: 2018లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1(APPSC) మెయిన్స్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది.. కరోనా వైరస్ సమయంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాలను APPSC డిజిటల్ గా మూల్యాంకనం చేసింది.. ప్రశ్నాపత్రాలను డిజిటల్ గా మూల్యాంకనం చేయడంపై హైకోర్టును అభ్యర్థులు ఆశ్రయించారు..తిరిగి మ్యాన్యువల్ గా మూల్యాంకనం చేయడంతో క్వాలిఫై కానీ కొందరు అభ్యర్థులు మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని హైకోర్టును ఆశ్రయించారు..బుధవారం ఈ విషయంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం,, పలుమార్లు మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది..దీంతో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయడంతో పాటు మళ్లీ పరీక్ష నిర్వహిచాలని,, ఎంపిక ప్రక్రియను 6 వారాల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం:- 2018 గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది..సదరు నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్నవారి ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇచ్చింది..హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని హామీ ఇచ్చింది..