తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసిన ఈసీ
హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు పూర్తిగా ప్రకటించక ముందే టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డిని కలవడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది..రేవంత్ రెడ్డిని కలిసిన కొంతసేపటికే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది..డీజీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది..మధ్యాహ్నం సమయంలోనే,,రేవంత్ రెడ్డి ఇంటికి అంజనీ కుమార్,,ఆయనతో పాటు పలువురు సీనియర్ పోలీసు అధికారులు వెళ్లి,రేవంత్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు..అర్హత ఉన్న పోలీస్ అధికారిని తదుపరి డీజీపీగా నియమించాలని ఈసీ ఆదేశించించినట్లు సమాచారం.