శుక్రవారం కర్ణాటక బంద్
అమరావతి: తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతొంది.. తమిళనాడుకు కావేరీ జలాల విడుదలను వ్యతిరేకిస్తూ కర్ణాటక జల సంరక్షణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కురుబురు శాంతకుమార్ నేతృత్వంలో బెంగళూరు నగర బంద్ కార్యక్రమం చేపట్టింది..ప్రభుత్వం 3 రోజుల్లోగా ఓ నిర్ణయాన్ని ప్రకటించాలని శాంత కుమార్ డిమాండ్ చేశారు..ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.. సెప్టెంబర్ 13 నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ(CWNA) కర్ణాటక ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది..ఈ విషయంలో కలుగజేసుకొనేందుకు ఈనెల 21న సుప్రీంకోర్టు తిరస్కరించింది.
శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్:- జల వివాదంపై ‘కన్నడ ఒక్కుత’ సంఘం శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది..మంగళవారం నాటి బంద్కు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మద్దతు పలికాయి..కావేరీ జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు..తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురైమురుగన్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆందోళనలతో సంబంధం లేకుండా సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని కోరారు.