NATIONAL

గాంధీ, లాల్ బహుదుర్ శాస్త్రి జయంతి సందర్బంగా నివాళిర్పించిన ప్రముఖులు

అమరావతి: గాంధీజీ జయంతి (1869 అక్టోబరు 2) సందర్భంగా ప్రముఖలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ప్రధానమంత్రి మోడీ, పాటు పలువురు ప్రముఖలు రాజ్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించారు. “ఈ గాంధీ జయంతి (153) మరింత ప్రత్యేకమైనది. దేశమొత్తం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేయండి అదే గాంధీజికి నిజమైన నివాళి” ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

నేడు లాల్ బహుదుర్ శాస్త్రి జయంతి (1904 అక్టోబర్ 2) సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయం మ్యూజియంలోని కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియాన్ని సందర్శించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *