AMARAVATHINATIONAL

ఉచిత రేషన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు-ప్రధాని మోదీ

అమరావతి: దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు..శనివారం ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ లో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు..కాంగ్రెస్ ఎప్పుడూ పేదలు పేదరికంలో వుండేలా చూసిందని,, పేదలు అర్ధికంగా అభివృద్ది చెందడం వారికి ఇష్టం లేదన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ నాయకులు,,పేదల హక్కులను,వారి కష్టాన్ని దోచుకుని తిని తమ ఖజానాను నింపుకున్నారంటూ మండిపడ్డారు..2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు..పేదరికాన్ని నిర్మూలించగలమని విశ్వాసం కలిగించామన్నారు.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు.. పేదరికం నుంచి బయటపడిన ప్రజలే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారని తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *