కొత్త ప్రభుత్వం పాలనలో బలమైన భాగస్వామ్యం తీసుకుంటాం-పవన్ కళ్యాణ్
అమరావతి: నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను,,కొత్తగా పార్టీలో చేరిన నాయకులతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనపార్టీ మరింత బలోపేతం అవుతుందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు..బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్, వైసీపీ నాయకులను అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర మాజీ అధ్యక్షుడు బాడిత శంకర్, మాజీ కార్పొరేటర్లు చిలక సలోమి భగవాన్, సముద్రాల ప్రసాద్, అవనిగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు రామాంజనేయులు జనసేనలో చేరారు..చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో చేరిన వారంతా రాష్ట్రంలో పాలనలో మార్పును కోరుకున్నరని పవన్ అన్నారు..2024లో ఆ మార్పును తీసుకురాబోతున్నామని,,కొత్త ప్రభుత్వంలో బలమైన భాగస్వామ్యం తీసుకుంటామని చెప్పారు.