AMARAVATHINATIONAL

బిగ్‌బాస్ అరవింద్ కేజ్రీవాల్ కు తీహార్ జైలు స్వాగతం పలుకుతొంది-సుకేష్ చంద్రశేఖరన్

అమరావతి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు  తీహార్ జైలుకు చేరుకొనున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు,,ఆర్థిక నేరారోపణల కింద తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ విడుదల చేశాడు.. ‘‘తీహార్‌ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా,, ఖట్టర్‌ ఇమాన్దార్‌ అనే డ్రామాలకు ముగింపు పడిందని లేఖలో పేర్కొన్నారు.. కేజ్రీవాల్‌ అవినీతి మొత్తం బహిర్గతమవుతోందని,,ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ 10 కుంభకోణాలు చేశారు…నాలుగు కుంభకోణాల్లో తానే సాక్షిగా ఉన్నా… ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ప్రారంభం మాత్రమే… నేను అప్రూవర్‌గా మారి ఇంకా ఎన్నో నిజాలు బయటపెడతా’’.. అంటూ సుకేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నాడు.

తీహార్ జైలును నడపడానికి తన ముగ్గురు సోదరులు ఇక్కడకు చేరుకున్నరని,,ఇందులో ఛైర్మన్ బిగ్‌బాస్ అరవింద్ కేజ్రీవాల్ అయితే సీఈవో మనీష్ సిసోడియా,, సీఓఓ సత్యేందర్ జైన్ అంటూ సుఖేష్ తన లేఖలో వ్యగ్యంగా వ్యాఖ్యనించారు..బ్రదర్ కేజ్రీవాల్ మీ అవినీతి అంతా బయట పడబోతుంది…మీరు సీఎం హోదాలో చేసిన స్కామ్‌లతో పేద ప్రజలను దోచుకున్నారని సుఖేష్ ఆరోపించాడు.. మీ మోసాలను పూర్తిగా బహిర్గతం చేస్తనాంటూ హెచ్చరించాడు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *