ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్న ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ దేవభూమి ఉత్తరాఖండ్ లో పర్యటించారు..గురువారం ప్రధాని నరేంద్రమోదీ పిథోరాఘడ్ జిల్లాలోని ఆది కైలాస శిఖరాన్ని దర్శించుకున్నారు..సంప్రదాయ దుస్తులతో కూడిన తలపాగా ధరించిన ప్రధాని మోదీ పార్వతి కుండ్లో శివుడికి హారతిని ఇచ్చి, ప్రత్యేకమైన పూజలు చేశారు..ఈ పర్యటనలో జగేశ్వర్ ధామ్, సరిహద్దు గ్రామమైన గుంజిని సందర్శించి, స్థానికులతో ముచ్చటించారు..ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ పిథోరాగడ్ జిల్లాలోని రూ.4,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు.. పిథోరాగఢ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు..ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో పాటు ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రులు, ఎంపీలు హాజరు అయ్యారు.
हर हर महादेव! pic.twitter.com/UiQ8dpg5jF
— Narendra Modi (@narendramodi) October 12, 2023