AMARAVATHIPOLITICS

నాకు సంపూర్ణ అధికారం ఇస్తే,దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా-పవన్

అమరావతి: మీరు నాకు సంపూర్ణ అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాను,,శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా చెపుతున్నా ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు..శుక్రవారం పిఠాపురంలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగిస్తూ నాకు అధికార పీఠం ఇవ్వండని నేను అర్థిస్తున్నా…నాకు ఎలాంటి భయాల్లేవు…ముఖ్యమంత్రిని సైతం ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను…పిచ్చివాగుడు వాగితే…ఇళ్ళలో నుంచి లాక్కొచ్చి కొడతా…జనసేన ప్రభుత్వం ఏర్పడితే గూండా కొడుకులకు నరకం చూపిస్తా… శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా…దత్తాత్రేయుడి సాక్షిగా కోరుతున్నా…నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు..‘ఆ భగవంతుడికి తప్ప ఎవ్వరికీ భయపడను…దోపిడీ చేసేవాళ్లు మనల్ని పాలిస్తుంటే చిరాకు వస్తొంది… పాపం పసివాడు…నోట్లో వేలుబెడితే కొరకలేడు…బాబాయిని చంపి నెత్తురు తుడుచుకొని…నోట్లో వేలుబెట్టుకొని కూర్చున్నాడు…నేరచరిత్ర ఉన్నవాడిని ఎన్నుకుంటే తుపాకులే తీస్తాడు…నేను బతికున్నంత కాలం నేరచరిత ఉన్నవాడు గద్దెనెక్కడానికి వీల్లేదు… ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన కులపోడా అనికాదు…మనకు సరైన నాయకుడా కాదా అనేది చూడాలి…అంటూ వైసీపీ ప్రభుత్వ పాలనపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *