ఆస్తిపై హక్కు కల్పించి ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వమిత్వ’ త్వరగా పూరి చేయండి-కలెక్టర్
నెల్లూరు: గ్రామీణ ప్రజలకు ఆస్తిపై హక్కు కల్పించి ఆస్తి కార్డులను పంపిణీ చేసే ‘స్వమిత్వ’సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో స్వమిత్వ కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో స్వమిత్వ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. డ్రోన్ ఫ్లయింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, మ్యాపింగ్, ఓ ఆర్ ఐ తయారు చేయడం, ఆస్తి కార్డులు పంపిణీ చేయడం వంటి ప్రక్రియలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. తొలుత డిపిఓ శ్రీమతి సుస్మిత మాట్లాడుతూ జిల్లాలో 722 గ్రామపంచాయతీలకు గాను 722 గ్రామపంచాయతీల్లో డోంట్ ఫ్లైయింగ్ పూర్తయిందని, 127 గ్రామ పంచాయతీలకు ఒఆర్ ఐ మ్యాప్ లు సిద్ధం చేశామని, 94 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందని,30 గ్రామాల్లో పురోగతిలో ఉందన్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా స్వమిత్వ కార్యక్రమాన్ని చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆమె కలెక్టర్ కు తెలిపారు. ఈ సమావేశంలో సర్వే, ల్యాండ్ రికార్డుల ఏడి హనుమాన్ ప్రసాద్, సర్వేయర్లు పాల్గొన్నారు.