ఈనెల 15 లోపల ఓటర్ల లిస్ట్ కరెక్ట్ చేయకపోతే కోర్టుకెళుతా-నారాయణ
కలెక్టర్, కమిషనర్ కు డెడ్ లైన్..
ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు, మార్పులు, మరణాలు అన్నీ సరి చేసి నిస్పక్షపాతమైన లిస్ట్ ను విడుదల చేయాలని, అధికారులు స్పందించకపోతే…ఒక వారం చూస్తానని… ఆ తరువాత నేరుగా కోర్టుకి వెళుతానని మాజీ మంత్రి నారాయణ కలెక్టర్, కమిషనర్లను హెచ్ రించారు.మంగళవారం ఓటర్ వెరిఫికేషన్ విషయమై…ఈ రోజు నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ను కలవడం జరిగిందని నారాయణ చెప్పారు..ఆ లిస్ట్ లో ఒకటి రెండు కాదని…2263 డబులింగ్ ఉన్నాయన్నారు.అదే విధంగా మూడు వారాల క్రితం కూడా 16 డివిజన్లో 14 పేర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆ 14 మంది ఇప్పుడు ఆ ఇంట్లో లేరని…అయినా వాటిని డిలీట్ చేయలేదన్నారు.ఈనెల 15వ తేదీ వరకు కలెక్టర్, కమిషనర్ లకు డెడ్ లైన్ ఇస్తున్నానని…అలోపలే ఓటర్ వెరిఫికేషన్ లో చేర్పులు, మార్పులు, డెత్లు అన్నీ సరి చేసి నిస్పక్షపాతమైన లిస్ట్ ను విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో… ఆ జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపిస్తానన్నారు. అప్పుడు కూడా అధికారులు స్పందించకపోతే…ఒక వారం చూస్తానని… ఆ తరువాత నేరుగా కోర్టుకి వెళుతానని నారాయణ హెచ్చరించారు.