అదుపు తప్పిన బస్సు- ఘోర ప్రమాదంలో 10 మంది మృతి
వైష్ణో దేవికి ఆలయంకు…
అమరావతి: జమ్మూ కాశ్మీర్ లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది..జమ్ములో జిల్లాలో జజ్జర్ కోట్లీ ప్రాంతంలో వంతెనపై నుంచి వెళ్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది..సంఘటనలో స్థలంలో పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..57 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.. ప్రయాణికులంతా మాతా వైష్ణో దేవికి ఆలయంకు వెళ్తున్న ట్లు సమాచారం..వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే భక్తులు కత్రా ప్రాంతం బేస్ క్యాంప్ ద్వారా ప్రయాణిస్తుంటారు..ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి,పోలీసులకు సమాచారం ఇవ్వడంతో,, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టినట్టు జమ్ము ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు..గాయపడిన వారిని జమ్ము ఆసుపత్రికి తరలించి,,చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఉన్నరని,,ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు..మరోవైపు సహాయ చర్యల కోసం NDRF,,CRPF బలగాలు సైతం రంగంలోకి దిగాయి..బస్సు అమృతసర్ నుంచి వస్తున్నట్లు సమాచారం వున్నదని,,బస్సులో బీహార్కు చెందిన వారు ఉన్నారని తెలిపారు..బస్సు కత్రా బేస్ క్యాంప్ కు వెళ్లే మార్గంలో,,దారి తప్పినట్లుగా గుర్తించడం జరిగిందని CRPF అసిస్టెంట్ కమాండెంట్ ఆశోక్ చౌదరి తెలిపారు..బస్సు ప్రమాదంలో బీహార్ కు చెందిన వారు మరణించినట్లు సమాచారం అందడంతో,బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు..బాధిత కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందచేస్తామని తెలిపారు.