AMARAVATHINATIONAL

ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రంప్రభుత్వం

అమరావతి: వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్రంప్రభుత్వం నిషేధం విధించింది.. దేశప్రజలకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది..ఉల్లిపాయల ఎగుమతులను వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు నిషేదిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఓ ప్రకటనలో పేర్కొంది..శుక్రవారం నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతి ఆధారంగా విదేశాలకు ఉల్లి ఎగుమతులు అనుమతిస్తున్నట్లు DGFT తెలిపింది..ఇందులో కొన్ని మినహాయింపులు కల్పిస్తూ,, ఈ నోటిఫికేషన్ కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని అలాగే ఇప్పటికే కస్టమ్స్ కు అప్పగించిన ఉల్లిపాయల సరుకును ఎగుమతి చేసుకోవచ్చని DGFT వెల్లడించింది..ఇతర దేశాలు నేరుగా భారత ప్రభుత్వంను అభ్యర్థిస్తే,,ఇందుకు భారతదేశం అనుమతిస్తే,, ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది..ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు దేశం నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లిపాయలు ఎగుమతి కాగా వాటిని బంగ్లాదేశ్, మలేషియా, UAE దేశాలు దేశీయ ఉల్లిని దిగుమతి చేసుకున్నాయి..ఖరీఫ్ సీజన్ లో ఉల్లి నిల్వలు తగ్గడంతో మార్కెట్ లో ఉల్లి ధరలు క్రమేపీ పెరగడం ప్రారంభించాయి..ఉల్లిపాయల ఎగుమతులను నిషేధించడంతో దేశీంగా ఉల్లిధరలు అదుపులో వుంటాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *