AMARAVATHIDEVOTIONAL

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నభారత ప్రధాని నరేంద్రమోదీ

తిరుమల: భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్,ఈఓ ధర్మారెడ్డి, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ తో స్వాగతం పలకగా ప్రధాని ముందుగా ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా, టీటీడీ చైర్మన్,ఈఓలు ప్రధానికి తీర్థ ప్రసాదాలను, స్వామి వారి చిత్ర పటాన్ని, టీటీడీ క్యాలెండర్, డైరీ 2024 పంచగవ్యాలను అందచేశారు. అంతకు మునుపు స్వామి వారి వద్ద ప్రధాని గారిని శేష వస్త్రంతో ఆలయ ప్రధాన అర్చకులు సత్కరించారు.
ప్రధానికి సాదర వీడ్కోలు:- తిరుమల శ్రీవారిని దర్శించుకుని సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడి తిరుగు ప్రయాణమైన్నారు..రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి,, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి సాదర వీడ్కోలు పలికారు.
140 కోట్ల మంది భారతీయులు:- ఈ సందర్భంగా ప్రధాని 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు,, అభివృద్ధి కలగాలని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థించానని తమ అనుభూతిని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *