ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం-ఇక నుంచి బట్టతో చేసినవే ఉండాలి-సీ.ఎం జగన్

అమరావతి: విశాఖపట్నం వేదికగా సీఎం జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని,,పర్యావరణంను కాపాడుకోవలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగించరాదని సీ.ఎం జగన్ స్పష్టం చేశారు.శుక్రవారం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా, ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు..2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మన సంకల్పంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నమని,, ప్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బట్టతో చేసినవే ఉండాలని సూచించారు. విశాఖ నుంచి ఈ ప్లాస్టీక్ ఫ్లెక్సీల నిషేదం అమలు కావాలని పిలుపునిచ్చారు.శుక్రవారం ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ, దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను వలంటీర్లు సముద్రం తీరం నుంచి తొలగించారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోందని,ఏపీలోని సముద్ర తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు..ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో చెత్తసేకరణ 100 శాతానికి పెంచాలని అన్నారు.పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుంది.రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులు తయారు చేస్తుంది.అలాగే పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు అని సీఎం జగన్ వెల్లడించారు..2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్గా మారుస్తామని ప్రకటించారు..