జగన్ ఒక క్యానర్స్ గడ్డ లాంటి వ్యక్తి,-చంద్రబాబు
నెల్లూరు: జగన్ ఒక క్యానర్స్ గడ్డ లాంటి వ్యక్తి అని,, వెంటనే ఆపరేషన్ చేసి గడ్డను తీసివేయకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం వుంది అంటూ,అధికారం నుంచి జగన్ దించివేయాలంటూ టీడీపీ కార్యకర్తలకు టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో అయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం సంక్షమే కార్యక్రమాల పేరుతో పేద ప్రజలకు ఇచ్చేది రూ.10,,లాక్కునేది రూ.100 అంటూ మండిపడ్డారు..నెల్లూరుజిల్లా కోర్టులో ఫైల్స్ ను మాయం చేసి దొంగ కూడా మాట్లాడుతున్నాడని తీవ్రస్థాయిలో విమర్శించారు..ఇలాంటి పనులు చేసిన ఇతనికి భయం లేదు,సిగ్గు లేదు,,ఆర్దిక ఉగ్రవాదులుగా మారుతున్నరంటూ ధ్వజమెత్తారు..పొదలకూరలో కొండలు,గుట్లు కూడా మాయం చేస్తున్నారని ఆరోపించారు..స్వర్ణ ముఖి నుంచి ఇసుక మద్రాసు,బెంగుళూరుకు వెళ్లుతొందని ఇందుకు సమాధానం చెప్పే ధైర్యం వీళ్లకు వుందా అంటూ ప్రశ్నించారు..వెంకటాచలంలో రూ.400 కోట్లు చేసే భూములను కొనడం చూస్తుంటే,,అవినితి ఏ స్థాయిలో జరుగుతొంది ఆర్దం చేసుకోవచ్చన్నారు.