కాంగ్రెస్ పార్టీలో చేరిన YCP సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో YCP సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా పార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నారు.. హైదరాబాద్లోని లోటస్పాండ్లో షర్మిలను ఆయన కలిశారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ సొంత పార్టీ నేతలు నన్ను ఇబ్బందులకు గురిచేశారు అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను అని అన్నారు..పార్టీ కార్యక్రమాలకు కూడా నన్ను పిలవకుండా, నాకు సమాచారం లేకుండానే రీజనల్ కో-ఆర్డినేటర్ సమావేశాలు పెట్టారని అరోపించారు.. ఈ విషయాన్ని చాలాసార్లు మా అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినప్పటికి సరైన స్పందన రాలేదన్నారు..అందుకే వైసీపీని వీడి,, కాంగ్రెస్లో చేరుతున్నాను అని తెలిపారు.