AMARAVATHICRIME

ఐదుగురు అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్,రూ. 4.49 కోట్ల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి..

తిరుపతి: ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో తమిళనాడుకు చెందిన 5 మంది అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి దాదాపు 4.49 కోట్ల రుపాయుల విలువగల ఎర్ర చందనం, 2 కార్లు స్వాదీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి చెప్పారు.సోమవారం తిరుపతి పోలీసు పెరేడ్ మైదానం నిర్వహించిన మీడియా సమావేశలో అయన మాట్లాడుతూ సుమారు 5,388 Kg ల 275 ఎర్ర చందనం దుంగలు, ముక్కలు, పొడి అలాగే రూ.18,00,000  విలువ గల రెండు కార్లు, నగదు 3200/- రూపాయలు, 6 సెల్ ఫోన్స్ ఉన్నాయన్నారు.. విశ్వనీయమైన సమాచారం అందడంతో NH-16 జాతీయ రహదారిపై పెద్ద పన్నంగాడు ఆంధ్ర బార్డర్ చెక్ పోస్ట్ వద్ద సూళ్లూరుపేట సిఐ మధుబాబు, తడ ఎస్ఐ శ్రీనివాస రెడ్డి, సూళ్లూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడు,,తడ, సూళ్ళురుపేట పొలీస్ స్టేషన్ ల సిబ్బంది మాటువేసి స్మగ్లర్లను అరెస్టు చేశారన్నారు.. పట్టుబడిన ముద్దయిలందరూ తమిళనాడుకు చెందినవారన్నారు.. A1.మురుగన్ ఇదివరకే PD-ACT క్రింద జైలు శిక్షను అనుభవించి, జూన్ నెలలో విడుదల అయ్యాడు..అయినప్పటికీ మళ్ళి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతుండని తెలిపారు..

అరెస్ట్ అయిన ముద్దాయిల వివరాలు ఇలా వున్నాయి..1. మురుగన్ @ మురుగానంద్, తండ్రి: పాలయన్, వయస్సు:42 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం రవాణాదారుడు)..2. హేమంత్ కుమార్ @ రాజ @ హరి, తండ్రి: కుప్పుస్వామి, వయస్సు:37 సం’లు, పల్లవరం, చెన్నై, తమిళనాడు. (ఎర్ర చదనం అమ్మే మధ్యవర్తి)..3. రవి, తండ్రి: సురేష్, వయస్సు:31 సం’లు, మనివాక్కం, చెన్నై, తమిళనాడు.( డ్రైవర్ & వర్కర్).. 4. విమల్, తండ్రి: రాజేంద్రన్, వయస్సు:32 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్)..5. సురేందర్, తండ్రి: గుణశేఖర్, వయస్సు:33 సం’లు, షోళవరం, చెన్నై, తమిళనాడు. ( డ్రైవర్ & వర్కర్).. పట్టుపడిన ముద్దాయిలందరిపై PD-ACT ప్రయోగిస్తామన్నారు.. ఈ దాడుల్లో తడ, సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *