AMARAVATHIPOLITICS

రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు-షర్మిల

రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్లు అప్పులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడ, కానూరులోని కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు..ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు పాల్గొన్నారు..ఈ సందర్బంలో అమె మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేకహోదా కావాలంటూ డిమాండ్ చేసిన వైఎస్ జగన్,, సీఎం అయ్యాక ఆ విషయం పక్కనపెట్టారంటూ విమర్శించారు..మూడు రాజధానులు కడతానని చెబుతున్నారని, ఏపీకి కనీసం ఒక్క రాజధాని కూడా లేదన్నారు.. గత పదేళ్లలో రాష్ట్రానికి పది పరిశ్రమలైనా వచ్చాయా? అని ప్రశ్నించారు..ఉద్యోగాల ఇస్తామని చెప్పి,, ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు..ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు.. భూతద్దం పెట్టి వెతికి చూసినా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని,,ఇదే సమయంలో దళితుల మీద దాడులు పెరిగాయన్నారు.. రాష్ట్రం నుంచి 22 మంది వైసీపీ, ముగ్గురు టీడీపీ ఎంపీలు,, మరో 6 గురు రాజ్యసభ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధించకపోగా బీజేపీకి తొత్తులుగా మారారని విమర్శించారు.. రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు..అయితే రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని,, అప్పు తెచ్చిన లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయింటూ ప్రశ్నించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *