AMARAVATHINATIONAL

భారత్-మియన్మార్ మధ్య వున్న సరిహద్దుకు సైతం కంచె వేస్తాం-హోం మంత్రి అమిత్ షా

అమరావతి: బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్లే మియన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం పేర్కొన్నారు..అసోం రాజధాని గౌహతిలో పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్న సందర్బంలో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ తో భారత్ న్న సరిహద్దు మాదిరిగానే మియన్మార్ తో వున్న సరిహద్దుకు సైతం కంచె వేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారని చెప్పారు..ఇప్పటి వరకు ఇరు దేశాల సరిహద్దుకు దగ్గరగా నివసించే వ్యక్తులు,, వీసా లేకుండా 16 కి.మీ.లు మరొకరి భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించే ఫ్రీ మూవ్ మెంట్ రీజిమ్ (FMR) త్వరలో తెరపడనున్నది.. భారత్ లోని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మియన్మార్ తో 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి..ఈ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులు,,మాఫియా ముఠాలు భారతదేశంలోకి యధేచ్చగా ప్రవేశిస్తున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *