AMARAVATHIPOLITICS

వైఎస్సార్ సీపీ నేతలు దూషణలకు ప్రజాక్షేత్రంలోనే సమాధానం ఇస్తా-పవన్

అమరావతి: వైఎస్సార్ సీపీ నేతలు చేసే విచిత్రిమైన పనులు అంటే మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని,,వైసీపీ నేతల మాటలకు తాను ప్రజా క్షేత్రంలో చేతలలో బదులిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు..గురువారం కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలులో వారాహి విజయ యాత్ర)లో ఆయన మాట్లాడుతూ ఇలాంటి దూషణలకు చేసినందుకు భవిష్యత్ లో మేము చింతిస్తున్నాము అని వారితోనే చెప్పిస్తానని సవాలు విసిరారు..తాము ప్రజల సమస్యల స్వయంగా తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.. గతంలో వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ ని వైసీపీ నేతలు పిచ్చోడిని చేశారని,,నేడు కాకినాడలో ప్రశ్నించినందుకు ఒక మహిళ మానసిక స్థితి బాగోలేదని ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు.. ఇక్కడి చెరువుల్లో మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారని తెలిపారు..రాష్ట్ర ప్రజల క్షేమం కోసమే తాను సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నానని అన్నారు..ఈ యాత్రలో జనసేన నేత నాగబాబు కూడా పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *