పోక్సో కేసు రద్దు చేయాలని పాటియాలా హౌస్ కోర్టులో ఢిల్లీ పోలీసులు పిటీషన్
అమరావతి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నరెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద పోక్సో కేసు రద్దు చేయాలని కోరుతూ పాటియాలా హౌస్ కోర్టులో ఢిల్లీ పోలీసులు గురువారం ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు..ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో బ్రిజ్ భూషణ్ పై పోక్సో చట్టం కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని 550 పేజీల నివేదికను సెక్షన్ 173(3) క్రింద ఢిల్లీ పోలీసు అధికారులు సమర్పించారు..“నేను ఎంపిక కాలేదు..నేను చాలా కష్టపడ్డాను..నేను డిప్రెషన్ లో ఉన్నాను..అందుకే కోపంతో ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసు పెట్టాను” అని మైనర్ రెజ్లర్ స్టేట్మెంట్ ఇచ్చిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మైనర్ తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి..ఈ కేసుపై ఢిల్లీ కోర్టు జూలై 4వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.