విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపు ఆదేశాలు ఆమలు
అమరావతి: విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు..సోమవారం ఉదయం 10 లోపు విధుల్లో చేరని అంగన్వాడీల తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.. విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని,,అలాగే విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.. కృష్ణా జిల్లాలో 109 మంది అంగన్వాడీల విధులకు హాజరయ్యారు.. 1485 మంది కార్యకర్తలతో సహా 1343 మంది సహాయకులు విధులకు హాజరవ్వకుండా సమ్మెలో పాల్గొన్నారు..వీళ్లందరినీ సోమవారం (22వ తేదీన) తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.. వీరి స్థానంలో కొత్త సిబ్బందిని నియమించే వరకు,, ఈ-కేంద్రాలకు ప్రత్యామ్నాయ సిబ్బందిని అధికారులు ఏర్పాటు చేశారు.