మార్చి 16న మా ముందు హాజరుకావాలి,కేజ్రీవాల్ కు కోర్టు సమన్లు
అమరావతి: మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 16న తమ ముందు హాజరుకావాలని గురువారం ఢిల్లీ కోర్టు ఆదేశించింది.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నాలుగు నెలల్లో వ్వవధిలో 8 సార్లు సమన్లు జారీ చేశారు..మద్యం కేసులో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరారు.. ఈడీ సమన్లుపై కేజ్రీవాల్ స్పందించడం లేదని,,ఈడీ బుధవారం కోర్టును ఆశ్రయించింది..ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్కు సమన్లు పంపింది.