AMARAVATHINATIONAL

దేవింద‌ర్ పాల్ సింగ్ విడుదల కోసం కేజ్రీవాల్ రూ.133 కోట్లను ఖ‌లిస్తానీలు ఇచ్చారు-పన్నున్

అమరావతి: ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్,, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోప‌ణ‌లు చేశారు..ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు వెల్లడించారు.. అరవింద్ కేజ్రీవాల్ 2014లో NYలోని గురుద్వారా రిచ్‌మండ్ హిల్స్‌లో ప్రో ఖలిస్తాన్ సిక్కులను కలుసుకుని ఈ డబ్బు అడిగారని తెలిపారు..2014 నుంచి 2022 వ‌ర‌కు దాదాపు (16.70 మిలియన్ డాలర్స్) రూ. 133.54 కోట్ల డ‌బ్బును ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీలు ట్రాన్స్‌ ఫ‌ర్ చేసిన‌ట్లు ప‌న్నున్ తెలిపారు..దీనికి సంబంధించి సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ అవుతోంది..దేవింద‌ర్ పాల్ సింగ్ బుల్లార్ అనే వ్యక్తిని విడుదల చేసేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డ‌బ్బులు తీసుకున్న‌ట్లు ఆ వీడియోలో ప‌న్నున్ ఆరోపించారు..1993 ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో బుల్లార్ నిందితుడిగా ఉన్నాడు..మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఈడీ కస్టడీలో వున్న కేజ్రీవాల్ వాడిన ఫోన్ ప్ర‌స్తుతం మిస్సింగ్‌లో ఉన్న‌ట్లు అధికారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *