రూ.30 వేలు లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడిన కోవూరు సబ్ రిజిస్టార్
నెల్లూరు: కోవూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంకు, డాక్యూమెంట్ రిజిస్ట్రేషన్ కు వెళ్లిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని,, సబ్ రిజిస్టార్ పి.శ్రీనివాసులు రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి,,ఆఫీసు బయటకు వున్న డాక్యూమెంట్ రైటర్ రాము అనే వ్యక్తిని కలవాలని సూచించారని బాధితుడు మీడియాకు తెలిపారు..బాధితుడి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలంటే,,అందుకు పంచాయితీ ఆప్రూవల్ లేదంటూ,, కార్యాలయం బయట వున్న డాక్యూమెంట్ రైటర్ రాముని కలుసుకోవాలని చెప్పారు.. డాక్యూమెంట్ రైటర్ రామును రాజ్ కుమార్ సంప్రదించగా, ఆఫీసు ఖర్చులు మరో రూ.20 వేలు కలిపి మొత్తం రూ.40 వేలు ఇవ్వాలని కోరారు..లంచం ఇవ్వడం ఇష్టంలేని రాజ్ కుమార్ ఏసిబీ అధికారులను సంప్రదించడంతో,,శుక్రవారం ఏసిబి అధికారులు రూ.30 వేలు లంచం తీసుకుంటున్న రిజిస్టార్ ను,,రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని, అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.