విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి సమావేశం
నెల్లూరు: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 18 వ తేదిన ఉదయం 11 గంటలకు ట్రంకురోడ్డులోని TVS కళ్యాణ సదన్ లో, నెల్లూరు కార్పోరేషన్ లోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో కలిసి విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి “నూతన కార్యవర్గమును” ఏన్నుకోవటం జరుగుతుందని విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు పిట్టి సత్య నాగేశ్వరరావు(8008170088) తెలిపారు..ఈ కార్యవర్గములో బాధ్యతలు తీసుకోదలిచిన వారు, ఆసక్తి గలవారు ముందుగా తనతో కాని లేక ప్రధాన కార్యదర్శి P.సురేంద్రరెడ్డితో(9440 275274) కలిసి మాట్లాడవలసినదిగా కోరారు..ఇదే సమావేశములో ఈ సంవత్సరము జరుగు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ, అనుమతులు, నిమజ్జన ఏర్పాట్లపై అందరం కలిసి చర్చించి, మన సమిష్ఠి నిర్ణయాన్ని అధికారులతో కలసి చర్చించటం జరుగుతుందన్నారు..