పెన్నా నదిలో ఇద్దరు యువకులు గల్లంతు ?
నెల్లూరు: పెన్నా నదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైనారు..శుక్రవారం 5 గురు స్నేహితులు జొన్నవాడ కూలిపోయిన బ్రిడ్జి ప్రాంతలో ఈత కోసం పెన్నానదిలోకి దిగారు..సదరు ప్రాంతంలో లొతైన గుంటల,,సుడిగుండాలు వుండడంతో ఒక్కసారిగ ఈతకు దిగిన యువకులు నీటిలోపలికి వెళ్లారు..బయట కుర్చుని వున్న యువకులు కేకలు వేసేలోపే ప్రమాదం జరిగిపోయింది..గల్లంతైన వారిలో యోగేష్,,సాయికిషొర్ లు వున్నారు..ఒకరు వివేకనంద కాలేజిలో డిగ్రీ చదువుతుండగా,మరోకరు వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి..సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు,,రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్లను రంగంలో దింపారు..యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.పూర్తి వివరాలు అందాల్సి వుంది.