AMARAVATHIEDUCATION JOBS

మార్చిలో టెన్త్, ఇంటర్ పరీక్షలు-షెడ్యూల్ విడుదల చేసిన-మంత్రి బొత్స

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు..మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం అని తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు..

ఇంటర్ మొదటి,,ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు దాదాపు 10 లక్షలు మంది హాజరుకానున్నారని తెలిపారు.. ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 25 వరకు జరుగుతాయి..పరీక్షలు మార్చి1 నుంచి 15 వరకు ఉదయం 9 గంటలు నుంచి 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు..ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవని,, ఒక రోజు ఫస్టియర్,, మరో రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందన్నారు.. ఏప్రిల్ లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి వివరించారు..పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనన్నట్టు వెల్లడించారు.. విద్యార్థులందరూ పరీక్షలు బాగా వ్రాయాలని ఆకాంక్షించారు.

10 CLASS………….

INTER………..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *