నిజం ఎప్పుడు నిష్టూరమే-రమణదీక్షితులపై వేటు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు అయిన రమణ దీక్షితులను తొలగిస్తూ, టీటీడీ పాలక మండలి సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంది..ఆయనను టీటీడీ నుంచి తొలగిస్తూ పాలకమండలిలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు..
ఇందుకు నేపథ్యం…. తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని, అన్యమతం విస్తృతంగా వ్యాపించిందని, నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణదీక్షితులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది..ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్, సీఎం జగన్ మోహన్రెడ్డి క్రిస్టియన్ అని, టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్దసమస్య అని అన్నారు..ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని,,ఖననం చేశారంటూ టీటీడీపై,, ఈవోపై రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
పాలకమండలి:- టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది..ఈ విషయాని తీవ్ర పరిగిణించిన టీటీడీ పాలక మండలి దీక్షితులుపై చర్యలు తీసుకుంది..