గుడిమల్లంలో నవపాషాణలతో భూమిపై వెలసిన తొలి స్వయంభూ శివలింగం
తిరుపతి: పరుశురామ్ క్షేత్రంగా వెలసి వున్న గుడిమల్లం దేవాలయంలో నవపాషాణలతో పురుషాంగ ఆకారంలో భూమి మీద వెలసిన తొలి స్వయంభూ శివలింగం అని ఇతిహసలు పేర్కొంటున్నాయి.ఈ శివలింగపై బ్రహా,విష్టు,మహేశ్వరులు భక్తులకు దర్శనం ఇస్తారు..ఈ శివలింగానికి పరుశురాముడు పూజలు నిర్వహించేవాడని పురాణాలు తెలియచేస్తున్నాయి..దేవాలయం లోపలి బాగంలో రెండు అంగుళాల వెడల్పుతో 18 రంధ్రాలు కన్పిస్తాయి.. వీటిని ఆష్టాదశ పీఠాలకు ప్రతికలని,,సదరు రంధ్రల నుంచి ప్రసరించే సూర్యరస్మితో గర్భగుడిలోని శివలింగం శక్తి పుంజుకుంటుందని చరిత్రకారులు వెల్లడించారు.. సహజంగానే దేవాలయల్లో గర్భగుడులు చతురస్రకారంలో వుంటాయి..అయితే గుడిమల్లంలో గర్భగుడి గజపుష్టికారం (ఏనుగు నడుమభాగం) లాంటి ఆకారంతో పల్లవరాజుల కాలంలో నిర్మించి,,పూజలు,హోమాలు చేశారని శాసనలు తెలియచేస్తున్నాయి..