ఇస్రో శాస్త్రవేత్త వలర్మతి మృతి
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో సైటింస్ట్ గా పని చేస్తున్న N.వలర్మతి (64)శనివారం గుండెపోటుతో మరణించారు.. శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగాలకు సంబంధించి కౌంట్ డౌన్ లపై తన స్వరం వినిపించిన వలర్మతి ఇక లేరు..తమిళనాడులోని అరియలూర్ కు చెందిన వలర్మతి చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో తన అద్వితీయ స్వరంతో ప్రకటనలు చేసిన ఆమె..శాస్త్రవేత్తగా ఎన్నో సేవాలు అందించారు..వలర్మతి మృతి పట్ల ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ పివి వెంకటకృష్ణ సంతాపం తెలిపారు..శ్రీహరికోట నుంచి ఇస్రో భవిష్యత్తు మిషన్ల కౌంట్ డౌన్ లో ఇకపై వలర్మతి స్వరం వినిపించదన్నారు.. చంద్రయాన్-3 ఆమె చివరి కౌంట్ డౌన్ అని గుర్తు చేసుకున్నారు.. వలర్మతి మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.