వేమన యూనివర్సిటీలో విగ్రహాం మార్పుపై-పవన్

హైదరాబాద్: కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహం తొలగించి వైఎస్ విగ్రహం ఏర్పాటు చేయడంపై జనసేనాని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగ స్పందించారు. యోగి వేమన రాసిన పద్యంతో వైసీపీ ప్రభుత్వాని నిలదీశారు.దీనికి సంబంధించి పవన్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం..
కడపలో యోగి వేమన యూనివర్శిటీని 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నెలకొల్పారు. వేమన గొప్పతనాన్ని చాటేలా యూనివర్శిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విగ్రహం తొలగించడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యలేనివాడు విద్వాంసుచేరువ
నుండగానే పండితుండుగాడు
కొలని హంసలకదా గొక్కెర లున్నట్లు
విశ్వదాభిరామ! వినుర వేమ!తాత్పర్యం: విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర ఉన్నంత మాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ ఉన్నంత మాత్రాన అది రాజహంస అవదు కదా అని అర్థం. pic.twitter.com/w9MnvuTO4K
— Pawan Kalyan (@PawanKalyan) November 10, 2022