సెప్టెంబర్ నుంచి పరిపాలనా రాజధానిగా విశాఖ-కాపురం కూడా ఇక్కడే-జగన్
అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తన లక్ష్యమని,,మూల పేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు రూ.4362 కోట్లు, బుడగట్లపాలేం ఫిషింగ్ హార్బర్ కు రూ.366 కోట్లు, హీరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజేక్ట్ కు రూ.176 కోట్లు, మహేంద్ర తన ఆప్ షోర్ పనుల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు..బుధవారం పలు పనులకు శంకుస్థాపన చేసిన అనతంరం సీ.ఎం మాట్లాడుతూ విస్తారమైన సముద్ర తీరం ఉన్నా ఇప్పటివరకు ఓ పోర్ట్, ఫిషింగ్ హార్బర్ లేదన్నారు..ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నామని,,మే3న బొగాపురం ఎయిర్ పోర్ట్, ఆ తర్వాత డేటా సెంటర్ కు శంఖుస్థాపన చేస్తున్నామని తెలిపారు.. వైజాగ్ నుండి ఎయిర్ పోర్ట్ కు 6 లైన్స్ హైవే నిర్నించనున్నామని పేర్కొన్నారు..విశాఖలో సెప్టెంబర్ నుంచి పరిపాలనా రాజధానిలో భాగంగా విశాఖలో కాపురం కూడా పెడతామని స్పష్టం చేశారు..