ఏ.పి,,తెలంగాణలో 60 వేల మంది క్యాడెట్స్ కు అన్ని కాలేజ్స్ లో అవకాశం-వి.ఎం రెడ్డి
నెల్లూరు: ఏ.పి,,తెలంగాణలో 60 వేల మంది క్యాడెట్స్ కు అన్ని కాలేజ్స్ లో అవకాశం కల్పిస్తామని ఏ.పి,,తెలంగాణ రాష్ట్రాల NCC డిప్యూటివ్ డైరెక్టర్ జనరల్ వి.మదన్ మోహన్ రెడ్డి తెలిపారు..గురువారం నెల్లూరు నగరంలోని NCC కార్యాలయాలను సందర్శించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ NCCలో విద్యార్దులు చేరడంతో వారికి క్రమశిక్షణ,జాతీయ భావం అలవర్చుకుంటారని తెలిపారు.అలాగే NCC క్యాడెట్స్ కు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు పలు రిజర్వేషన్స్ వున్నాయని,,మల్టినేషనల్ కంపెనీలు సైతం ఉద్యోగాల్లో, NCC అభ్యర్దులకు ప్రాముఖ్యతను ఇస్తాయన్నారు. NCC క్యాడెట్స్ గా చేరిన విద్యార్దులకు సైబర్ సెక్యూరీటీ,, మల్టిలాంగ్వేజ్,,గ్రూప్ డిస్కషన్స్ లో శిక్షణ,,రైఫిల్ ను ఉపయోగించడం నేర్పించడం జరుగుతుందన్నారు..ఈ కార్యక్రమంలో గ్రూప్ కమాండర్ చంద్రశేఖర్,,లెప్లినెంట్ కమాండర్స్ ఆర్.ముకుందన్,,వినయ్,,రామచంద్రన్,,సివిల్ ఉద్యోగులు పాల్గొన్నారు.