AMARAVATHIPOLITICS

చంద్రబాబుతో సమావేశం అయ్యేందుకు విజయవాడకు  చేరుకున్న పీకే

అమరావతి: మరో 3 నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపద్యంలో రాష్ట్రంలో అధికార,,ప్రతిపక్షలు వ్యూహలకు పదును పెడుతున్నాయి.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం విజయవాడకు చేరుకున్నారు..గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను రిసీవ్ చేసుకుని లోకేష్,, ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లారు..రాష్ట్రా ఎన్నికల్లో టీడీపీ తరఫున పీకే పనిచేసే అవకాశమున్నట్లు సమాచారం..నేడు చంద్రబాబుతో పీకే భేటీ కావడంతో ఇక దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి.. గత ఏపీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున పనిచేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది.,అప్పట్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది..ఈ సారి జనసేనతో కలిసి పోటీ చేస్తామని టీడీనీ ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది… ఏపీలో ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచించుకుంటున్నాయి. ఏయే సీట్లను ఎవరికి కేటాయించాలన్న విషయంపై నిమగ్నమయ్యాయి.చ సర్వేల ఆధారంగా కొన్ని పార్టీలు టికెట్ల కేటాయింపు, సీట్ల మార్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *