ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల కు ప్రారంభమైంది-జిల్లా ఎన్నికల అధికారి
నెల్లూరు: జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల కు ప్రారంభమైందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుండి లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.వి.ఎన్. చక్రధర్ బాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుచున్నదన్నారు. మొదట ఒక గంటలో 4 శాతం పోలింగ్ నమోదు అయిందని, పొలీసు సిబ్బంది, పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా వుంటూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా విధులు నిర్వరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 169 పోలింగ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుతో పాటు వేసవికాలం దృష్ట్యా ఓటర్లుకు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. సాయంత్రం 4 గంటలు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను 4 డివిజన్స్ లోని రిసెప్షన్ కేంద్రాల నుండి నేరుగా చిత్తూరు రిటర్నింగ్ అధికారికి అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లందరూ స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, పొల్యూష కంట్రోల్ బోర్డు ఈఈ, వెబ్ కాస్టింగ్ నోడల్ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం.
పట్టభద్రులు ఎమ్మెల్సీ : 24.58 శాతం.…ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ : 39.72 శాతం