x
Close
NATIONAL

4వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని మోదీ

4వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
  • PublishedOctober 13, 2022

అమరావతి: హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్ నుంచి 4వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ రైలు హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా నుంచి ఢిల్లీ వరకు నడుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి నడిచే తొలి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ట్రైన్.. బుధవారం ఒక్క రోజు మినహా, ఈ ట్రైన్ వారంలో మిగిలిన అన్ని రోజులలో సేవాలు అందిస్తుంది.ఈ రైలు హిమాచల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించడానికి కేవలం 5 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ, చండీగఢ్ మధ్య మూడు గంటల్లో ప్రయాణం చేయవచ్చు.ఇప్పటికే దేశంలో 3 వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనా స్టేషన్స్ లో ఆగుతుంది. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగంను రైలు అందుకుంటుంది.

Spread the love
Written By
venkat seelam

Leave a Reply

Your email address will not be published.