AMARAVATHIINTERNATIONAL

ప్రధాని మోదీ అమెరికా పర్యాటన, కొందరికి మోదం మరి కొందరికి ఖేదం

ధృఢమైన వైఖరిని అవలంభిస్తొన్న న్యూ ఇండియా..
అమరావతి: భారతదేశాన్ని దశాబ్దం క్రిందటి వరకు అమెరికా,,వెస్ట్రన్ కంట్ర్సీ ఓ బలహీనమైన దేశంగా,,ఆటలో దొల్లుడు పుచ్చాకాయలగా భావించాయి..అయితే నేడు న్యూ ఇండియా,అన్ని విషయాల్లో ఇందుకు పూర్తి భిన్నంగా ధృఢమైన వైఖరిని అవలంభిస్తొంది..దింతో అమెరికాతో పాటు వెస్ట్రన్ కంట్ర్సీ తమ వైఖరిని మార్చుకుంటున్నాయి.. భారత్ కు సరిహాద్దు దేశాలు అయిన చైనా,,పాకిస్తాన్ లకు నిద్రపట్టడడంలేదు..దింతో ప్రధాని మోదీ పర్యాటనపై బురద చల్లేందుకు,,దేశీయంగా కొన్ని వర్గాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి..
ఈ నేపధ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేది నుంచి 25వ తేదీ వరకు అమెరికా,, ఈజిప్ట్ దేశాల్లో పర్యటించనున్నారు..ప్రధాని మోదీ పర్యాటనకు అమెరికా అత్యంత ప్రాధాన్యత ఇస్తొంది..భారత,,అమెరికాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయో అన్న కూతుహలం ప్రపంచ దేశాలను కుదురుగా వుండనివ్వడంలేదు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యాటన వివరాలు:-
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా,,జూన్ 20వ తేదిన న్యూయార్క్ వెళ్తారు..ప్రధాని మోదీకి అండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద భారతీయ అమెరికన్ల బృందం స్వాగతం పలకనున్నది..
జూన్ 21వ తేదిన న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తారు..
యూఎన్ ప్రధాన కార్యాలయం నుంచి మోదీ వాషింగ్టన్ డీసీకి వెళ్తారు..అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ లు స్వాగతం పలుకుతారు..అనంతరం వారితో కలిసి ప్రదాన మంత్రి ప్రైవేట్ విందులో పాల్గొంటారు..
జూన్ 22వ తేదిన ప్రధాని మోదీకి వైట్ హౌస్ వద్ద లాంఛనప్రాయ స్వాగతం ఉంటుంది..ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో సహా వెయ్యి మందికిపైగా స్థానిక అతిధులు హాజరు అవుతారు..
స్వాగత కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు.. రెండు దేశాల ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ వ్యవస్థల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్చలు ద్రోహదపడతాయని ఇరుదేశాల అధికారులు ప్రకటన విడుదల చేశారు..
ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ, సెనేట్ మెజారిటీ నాయకుడు చక్ ఘమెర్ తో సహా కాంగ్రెస్ నేతల ఆహ్వానం మేరకు అదేరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు..
జోబిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ జూన్ 22వ తేదిన సాయంత్రం ప్రధాని మోడీ గౌరవార్ధం స్టేట్ డిన్నర్ ను ఏర్పాటు చేశారు..వందల మంది అతిథులు, కాంగ్రెస్ సభ్యులు, దౌత్య వేత్తలు, ప్రముఖులు ఈ విందులో పాల్గొంటారు..
జూన్ 23వ తేదిన ప్రధాని మోదీకి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రాష్ట్ర కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నారు.. అనంతరం పలు కంపెనీలకు చెందిన సీఈఓలు, వివిద రంగాల నిఫుణులు, ఇతరులతో మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు..
జూన్ 23వ తేదిన సాయంత్రం రోనాల్డ్ రీగన్ సెంటర్ లో జరిగే మెగా ఈవెంట్ లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు..
అమెరికా పర్యటన అనంతరం జూన్ 24వ తేదిన ప్రధాని మోదీ ఈజిప్టుకు వెళ్తారు..ఆ దేశ అధ్యక్షులు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసిని కలుసుకుంటారు..ఇరు దేశాల అధ్యక్షుల మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకునేవిధంగా చర్చలు జరగనున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *