వంటగ్యాస్ సిలెండర్స్ పైన రూ.200 తగ్గింపు- అనురాగ్ ఠాకూర్
అమరావతి: ఓనం,,రాఖీ పండుగల సందర్బంగా మహిళలకు కానుకగా, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎల్ పీజీ వంటగ్యాస్ సిలెండర్స్ పైన రూ.200 తగ్గించారని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.. మంగళవారం ఢిల్లీలో కేంద్రం కేబినెట్ సమావేశం అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ రాయితీ రేపటి నుంచే అమల్లోకి వస్తుందన్నారు..ఉజ్వల పథకం క్రింది ఇప్పటికే 9.7 కోట్ల మంది వినియోగదారులు వున్నారని,, ఆదనంగా మరో 75 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు..ప్రస్తుతం ఉజ్వల పథకం క్రింద లబ్దిదారులకు రూ.200 సబ్సీడి ఇస్తున్నమని,, ఆదనంగా మరో రూ.200 రాయితీ వస్తుందన్నారు..ఈ రాయితీ పథకం అన్ని వర్గాల ప్రజలకు వర్తింస్తుందన్నారు.. మధ్య,,దిగువ మధ్యతరగతి మహిళల సంక్షేమం కోసం కేంద్రం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తొందన్నారు..