AMARAVATHINATIONAL

చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ఎంపిక

అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజెపీ విజయం సాధించిన 3 రాష్ట్రల్లో ముఖ్యమంత్రి అభ్యర్దిపై బీజెపీ అధిష్టానం సుధీర్ఘగా కసరత్తు చేసింది.. చత్తీస్ ఘడ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ను ఎంపిక చేసింది..అదివారం రాయ్ పూర్ లో జరిగిన 54 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్ ను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.. విష్ణుదేవ్ సాయి గతంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.. 2020 వరకు చత్తీస్ ఘడ్ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయ్ ను బీజేపీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.. సీఎం పదవి కోసం మాజీ సీఎం రమణ్ సింగ్, రేణుకాసింగ్, అరుణా సావ్, విష్ణుదేవ్ సాయ్, ఓపీ చౌదరిలు పోటీ పడ్డారు..తుదకు ఎమ్మెల్యేలు, విష్ణుదేవ్ సాయ్ వైపు మొగ్గు చూపడంతో అధిష్టానం అతని పేరును ప్రకటించింది. ముగ్గురు కేంద్ర పరిశీలకుల పర్యవేక్షణలో కొత్త సీఎం ఎన్నిక జరిగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *