AMARAVATHICRIME

కరోనా వైరస్ పేరుతో లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు స్వాహ

ఇంత ఆలస్యంగా వెలుగులోకి ఎందుకు వచ్చిందబ్బా??

నెల్లూరు: కరోనా వైరస్ పేరుతో లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు స్వాహ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి? వచ్చింది.. నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలంలో 2020-21 సంవత్సంరలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రక్షణకవచ్ అనే పథకంలో ఈ స్కామ్ చోటు చేసుకుంది..సోమవారం వైసీపీ నాయకుడు సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ఈ స్కామ్ లో పాత్రధారులు ఇందుకూరుపేట బిట్-1 సచివాలయం మహిళ పోలీసు విజయలక్ష్మి,, SK.జాలీల్ హోంగార్డుగా పనిచేస్తున్నారు..వీరిద్దరు కలసి,,వారికి పరిచయం వున్న వారి వివరాలను,సేకరించి వారికి కరోనా వైరస్ రాకపోయిన,, వారికి వచ్చినట్లు చూపి,,దాదాపు 15 మందికి సంబంధించి రూ.2 నుంచి 2,50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి స్వాహ చేశారు.గత సంవత్సరం జరిగిన ఈ సంఘటన ఇంత ఆలస్యంగా ఎందుకు బయటలకు వచ్చిందొ దేవుడికే తెలియాలి..? ఈ సంఘటనపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *