సుప్రీమ్ కోర్టులో చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ రేపటికి వాయిదా
అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు Quash Petitionపై వాదనలు మంగళవారం వినేందుకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం అనుమతిచ్చింది..స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన అరెస్టు చెల్లదంటూ, సీఐడీ దాఖలు చేసిన FIRను రద్దుకు చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం విదితమే..చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా మెన్షన్ చేశారు..ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయం అని,,అక్కడి ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేస్తున్నాయని లూథ్రా సుప్రీంకోర్టుకు తెలిపారు..ఇందుకు సీజేఐ స్పందిస్తూ చంద్రబాబు ఎన్నిరోజుల నుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించగా,, ఈనెల 8వ తదిన అయన అరెస్టు చేశారని లూథ్రా తెలిపారు..రేపటి మెన్షన్ లిస్టులో పూర్తిగా వింటామని సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.